
ఆధునిక హిందీ సాహిత్యంలో సుప్రసిద్ధ సాహితీవేత్త, కవి వినోద్కుమార్ శుక్లాకు 2024కు గాను జ్ఞాన్పీఠ్ పురస్కారం లభించింది. ఛత్తీస్గఢ్కు చెందిన వినోద్కుమార్ శుక్లా అనేక నవలలు, కథలు, కవితలు రాశారు. దీవార్ మే ఏక్ ఖిడ్కీ థీ అనే నవలకు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ప్రముఖ ఒడియా రచయిత్రి ప్రతిభా రే అధ్యక్షతన సమావేశమైన జ్యూరీ వినోద్కుమార్శుక్లాకు జ్ఞానపీఠ్ పురస్కారం ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది.
ఈ పురస్కారాన్ని అందుకున్న హిందీ రచయితల్లో వినోద్ కుమార్ శుక్లా 12వ వారు కాగా, ఛత్తీస్గఢ్ నుంచి జ్ఞాన్పీఠ్ అవార్డు అందుకోనున్న తొలి రచయిత. ఈ ఏడాది జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతను ఎంపిక చేసేందుకు ఏర్పాటైన జ్యూరీలో ప్రతిభా రేతోపాటు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్, ప్రముఖ రచయితలు ప్రభావర్మ, దామోదర్ మోజో, అనామిక, ప్రఫుల్ షిలేదార్, జానకీ ప్రసాద్ వర్మ, జర్నలిస్టు కృష్ణారావు ఉన్నారు.